Arrangements in full swing for Class 10th and Intermediate exams

 

Arrangements in full swing for Class 10th and Intermediate exams

పదవ తరగతి,ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ
ఏర్పాట్లు :: జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ వి. సి . హాల్ లో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.తేదీ.25.02.2026 బుధవారం నుంచి 16.03.2026 వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలు, తేదీ.14.03.2026 నుంచి తేదీ.16.04.2026 వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఇంటర్మీడియట్ పరీక్షల కోసం జిల్లాలో ఇంటర్ మొదటి ,రెండవ సంవత్సరం 8192 మంది విద్యార్థులకు 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే ఎస్ఎస్సి పరీక్షలలో 8318 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని 43 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పరీక్షలలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ చీటింగ్ వంటివి జరగకుండా చూడటానికి ముగ్గురు అధికారుల బృందంతో కూడిన ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ను ఏర్పాటు చేశామని అన్నారు.
విద్యార్థులు సరైన సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా సమయానికి ప్రత్యేక బస్సులను సిద్ధం చేసినట్లు, పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులు కేవలం హాల్టికట్ తప్ప ఎలాంటి వస్తువులను తీసుకు వెళ్లడానికి అనుమతి లేదని, తమ వస్తువులను భద్రపరచడానికి క్లోక్ రూమ్ సిద్ధం చేశామని,పరీక్ష కేంద్రాల సమీపంలోని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బి.ఎస్.ఎన్ సెక్షన్ 163 ( సి ఆర్ పి సి 144) అమలు చేయాలని, జిరాక్స్ దుకాణాలు మూసివేయాలని అన్నారు. పరీక్ష కేంద్రం వద్ద పరీక్ష పత్రాల తరలింపులో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, అన్ని పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు త్రాగునీరు సౌకర్యవంతమైన బెంచి లను , లైటింగ్, వైద్య శిబిరం తదితర వసతులను కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఉదయం 8:30 నిమిషాలకే చేరుకోవాలని మధ్యాహ్నం 12 గంటల కు పరీక్ష పూర్తి అయిన తరువాతనే పరీక్షా కేంద్రాల నుంచి బయటికి వెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్.పి.డాక్టర్ వినీత్ అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీను, ఆర్ ఆర్.డి.ఓ.రామచందర్,డి ఐ ఈ ఓ, డీఈవో, ఆర్టీసీ డి. యం . సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment