వలసల జిల్లాగా ఉన్న నారాయణపేట ను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశం

నారాయణపేట జిల్లా :పేద ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక,యువజన సేవలు, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. నారాయణపేట జిల్లాలో 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా పట్టణంలోని గాయత్రి ఫంక్షన్ హాల్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ … Read more

కొత్త అవకాశాలు దివ్యాంగుల జీవితాల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయని అన్నారు

నారాయణపేట జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల యాక్షన్ ప్లాన్” లో భాగంగా నారాయణపేట జిల్లా గాయత్రి ఫంక్షన్ హాల్, నారాయణపేటలో జిల్లా సంక్షేమ శాఖ మరియు తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లాకు చెందిన దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి గారు, విశిష్ట అతిథిగా … Read more

నారాయణపేట జిల్లా వార్షిక విద్యా ప్రణాళిక సమావేశం విజయవంతం

నారాయణపేట జిల్లా వార్షిక విద్యా ప్రణాళిక సమావేశం – రెండవ రోజు విజయవంతం విద్యార్థుల అభ్యాస ప్రమాణాల పెంపు దిశగా వినూత్న కార్యక్రమాలకు కార్యాచరణ ప్రణాళిక నారాయణపేట జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 21.05.2026 న నారాయణపేట పట్టణంలోని టి.ఎస్.డబ్ల్యూ.ఆర్.ఎస్.జె.సి, జి. యాదగిరి రోడ్ ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా వార్షిక విద్యా ప్రణాళిక సమావేశం రెండవ రోజు విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న రిసోర్స్ టీచర్లు, ప్యానల్ ఇన్‌స్పెక్షన్ సభ్యులు, ఆర్పీలు, ప్రధానోపాధ్యాయులు, అకాడెమిక్ … Read more

శివాలయం నిర్మాణానికి సహకారం

నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గున్ముకుల గ్రామంలో కడప రాయుడు దేవాలయం సమీపంలో శివాలయం నిర్మాణానికి గ్రామ ప్రజలు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా శివాలయం నిర్మాణానికి సహకారం అందించాలని కోరుతూ గ్రామ పెద్దలు, యువకులు కలిసి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె. రాజ్ కుమార్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలయ నిర్మాణం గ్రామ ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని గ్రామస్తులు తెలిపారు. గ్రామ ప్రజల వినతిని ఆలకించిన డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి గారు … Read more

ముఖ్య మంత్రి ప్రకటించిన వేతనాల పెంపులో శాస్త్రీయత లేదు

. పెరిగిన ధరలకు అణుగుణంగా కనీస వేతనాలు పెంచాలి. -CITU డిమాండ్. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రెవంత్రెడ్డి గారు ఈ రోజు సచివాలయంలో ప్రెస్మీట్ పెట్టి కార్మిక శాఖ పరిధిలోని షెడ్యుల్డ్ ఎంప్లామెంట్స్లో కనీస వేతనాల పెంపుదలను ప్రకటించారు. సుమారు 14 సం॥ల తరువాత రాష్ట్రంలో కనీస వేతనాలు సవరించడం ఆహ్వానించదగ్గ పరిణామం. 26 జూన్ 2 నుండి సవరించిన వేతనాలు అమలు చేస్తామని ప్రకటించారు. కోటి 11 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం కల్గుతుందని చెప్పారు. … Read more

Special checks with police vigil to eradicate narcotics

మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీస్ జాగిలంతో ప్రత్యేక తనిఖీలు: మద్దూర్ ఎస్సై శ్రీనివాసులు నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS ఆదేశాల మేరకు మత్తు పదార్థాల నిర్మూలనకు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా ఈ రోజు మద్దూరు మండల కేంద్రంలో ఈగల్ ఫోర్స్ టీంతో ప్రత్యేక శిక్షణ పొందిన నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు మద్దూర్ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా బస్ స్టాండ్ పాన్ షాపులు తదితర ప్రదేశాల్లో … Read more

బ్యాంకులో నగదు డ్రా చేసిన తర్వాత డబ్బును బహిరంగంగా

బ్యాంకుల వద్ద జాగ్రత్తలు పాటించాలి: మరికల్ సీఐ భగవంత్ రెడ్డి. బ్యాంకులకు వచ్చే ప్రజలు, బ్యాంకు అధికారులు, సిబ్బంది భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని మరికల్ సీఐ భగవంత్ రెడ్డి సూచించారు. నారాయణపేట జిల్లా  మరికల్ సీఐ భగవంత్ రెడ్డి, ఎస్ఐ రాములు మరికల్ పట్టణంలోని బ్యాంకులను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాంకుల పరిసర ప్రాంతాల్లో నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అవి నిరంతరం పనిచేసేలా చూడాలని … Read more

Police services at your fingertips with just a phone call ఒక ఫోన్ కాల్‌తో మీ వద్దకే పోలీసు సేవలు

ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్‌తో ప్రజల వద్దకే పోలీసు సేవలు: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS. ఒక ఫోన్ కాల్‌తో మీ వద్దకే పోలీసు సేవలు సంఘటన స్థలానికే చేరుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్న పోలీసులు అత్యవసర సమయంలో ప్రజలకు అండగా జిల్లా పోలీసులు నారాయణపేట: ప్రజలకు మరింత చేరువయ్యే లక్ష్యంతో నారాయణపేట జిల్లా పోలీసులు ఆన్‌సైట్ -ఎఫ్‌ఐఆర్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదు దారులు … Read more

కేసులని డిస్పోజల్ చేయట్లేదని ఆవేదన సీనియర్ సివిల్ శ్రీమతి విద్య నాయక్.

నారాయణపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మార్చ్ 28న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ఉద్దేశించి పోలీస్ ఆఫీసర్స్ తో సీనియర్ సివిల్ జడ్జి మరియు లీగల్ సర్వీసెస్ కార్యదర్శి శ్రీమతి వింధ్య నాయక్ గారు మాట్లాడుతూ..రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించడానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని న్యాయమూర్తి తెలిపారు. నారాయణపేట జిల్లాలోని మొత్తం 14 పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసులను అడిగి తెలుసుకున్నారు. వాటిని ఈ లోక్ అదాలత్ లో త్వరగా … Read more